న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి మెటా సంస్థ క్షమాపణలు(Meta Apology) చెప్పింది. ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసిన అంశంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. టెక్నికల్ కారణాల వల్ల ఆ వీడియోను తొలగించినట్లు మెటా సంస్థ అధికారులతో పేర్కొన్నది. అయితే తొందరపాటు ఆ వీడియోను తొలగించామని, కానీ మళ్లీ ఆ వీడియోను రిస్టోర్ చేసినట్లు మెటా సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్ నుంచి మోదీ వీడియోను తొలగించడం పట్ల ప్రభుత్వం సిరీయస్గా ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వార తెలుస్తోంది. మెటా ఇచ్చిన వివరణపై అధికారులు ఆరా తీస్తున్నారు. వరుసక్రమ ఘటనలపై ఫోకస్ పెట్టారు.
మెటా సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులకు .. ప్రభుత్వం సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. జూలై 23వ తేదీన ప్రధాని మోదీ ఓ వీడియోను అప్లోడ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనలను నిలువరించేందుకు కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని తన వీడియోలో పేర్కొన్నారు. అయితే వీడియోను కాసేపు ఎక్స్లో కనిపించలేదు. ఓ లీగల్ రిక్వెస్ట్ వల్ల వీడియోను విత్హెల్డ్లో పెట్టినట్లు నోటీసులో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆ వీడియో రిస్టోర్ అయ్యింది. వీడియోను తొలగించడానికి ముందే దానికి లక్షల సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి.