నల్లగొండ రూరల్, మే 9 : మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి లింగన్న అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.
వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ మాట ఇచ్చి తప్పిందన్నారు. కాంగ్రెస్ అమలు కాని మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలోనే మాదిగలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయని చెప్పారు. కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి మాదిగ ముందుకు వచ్చి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర ఆంజనేయులు, జిల్లా యువసేన ఇన్చార్జి జిల్లా నరేందర్, ఇంజమూరు వెంకటేశ్వర్లు, కృష్ణ, చంద్రయ్య, బంగారి కోటయ్య, కోటేశ్వర్రావు పాల్గొన్నారు.