Manne Krishank | హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ చంచల్గూడ జైలు నుంచి శుక్రవారం రాత్రి విడుదలయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ. 25 వేలతో కూడిన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన క్రిశాంక్కు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు.