Lashkar Commander : పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కు చెందిన సీనియర్ కమాండర్ ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ (Qari Saieed Abdul Aziz) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లష్కరేకు చెందిన ముసుగు సంస్థ జమాత్ ఉద్ దవాలో ఇతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రార్థనామందిరం ప్రవేశ ద్వారం వద్ద అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కోలుకోలేదు. మెడికల్ ఎమర్జెన్సీ (Medical Emergency) కారణంగానా, లేదా విషప్రయోగం కారణంగా మరణించాడా అనేది కచ్చితంగా తెలియరాలేదు.
అబ్దుల్ అజీజ్ జమ్ముశ్మీర్లో ప్రవేశించే ఉగ్రవాదులకు సేఫ్హౌసలు, ఆర్థిక సాయం, తప్పుడు పత్రాలు సమకూర్చడం వంటివి చేస్తుంటాడు. నీలమ్ వ్యాలీ, ముజఫరాబాద్ మీదుగా ఉగ్రవాదులను పంపుతుంటాడు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం సమకూర్చడం కూడా ఇతడి బాధ్యత. ఇటీవల లష్కరేకు చెందిన సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ ఓ వీడియో విడుదల చేశాడు. తమ సంస్థకు చెందిన 30 మంది సభ్యులను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఆరోపించాడు.
వీరంతా గత నాలుగేళ్లలో పాక్, పీవోకేలో మరణించినట్లు పేర్కొన్నాడు. ఇటువంటి హత్యలు జరుగుతున్నట్లు లష్కరే బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి.