న్యూఢిల్లీ : దేశంలో రోజుకు కోటి మోతాదుల వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్ఐటీఐ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ చెప్పారు. ఇది కొన్ని వారాల్లో సాధ్యమవుతుందని అన్నారు. గతంలో ఒకే రోజులో 43 లక్షల వ్యాక్సిన్ డోసులను ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాబోయే 3 వారాల్లో 73 లక్షలకు తీసుకురావాలని యోచిస్తున్నామన్నారు. టీకా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిర్ణయాలు తీసుకుంటున్నదని, టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పడం సరైంది కాదని ఆయన తెలిపారు.
చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు కోవాగ్జిన్ టీకాకు అనుమతి లభించిందని, త్వరలోనే వారు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తారని వీకే పాల్ చెప్పారు. సీరం ఇన్స్టిట్యూట్ పిల్లలపై నోవావాక్స్ క్లినికల్ ట్రయల్ ప్రారంభించాలని కోరుకుంటున్నదని సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా పిల్లలకు టీకా ఇవ్వడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఎటువంటి సిఫార్సులు చేయలేదన్నారు.
టీకా సరఫరా నిలిచిపోయిందని చెప్పడం సరైంది కాదని వీకే పాల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేయవచ్చని చెప్పారు. ఇలా కొనుగోలు చేసినవి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని పేర్కొన్నారు.
సంకీర్ణ ధర్మం పాటించకపోతే మద్దతు ఉపసంహరణ : ఠాక్రేకు కాంగ్రెస్ బెదిరింపు
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..