ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ అగాదిలో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తున్నది. తమ పార్టీ ముందుకు తెస్తున్న డిమాండ్ను నెరవేర్చకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను బెదిరిస్తున్నది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అంతకుముందు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాసి సంకీర్ణ ధర్మాన్ని గుర్తు చేశారు.
కొంకణ్లోని నానార్ సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారానికి మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మద్దతు పలికారు. అయితే, శివసేన దీనిని వ్యతిరేకించాలని నిర్ణయించడంతో ఇరు పార్టీల మధ్య వివాదం ప్రారంభమై మద్దతు ఉపసంహరణ, ప్రభుత్వం నుంచి వైదొలిగే వరకు వెళ్లింది. నానార్లోని చమురు శుద్ధి కర్మాగారం భారీ పెట్టుబడులు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి కల్పిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే అంటున్నారు. నానార్ నుంచి తన పార్టీకి చెందిన సర్పంచ్ ప్రభుదేశాయి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఇది కొంకణ్ ప్రాంతం పర్యావరణ వ్యవస్థ, అందానికి ముప్పు తెస్తుందని ప్రభు దేశాయి అంటున్నారు.
ఈ నేపథ్యంలో నానార్ ప్రజలతో ఉంటామని ముఖ్యమంత్రి ఠాక్రే నొక్కి చెప్పారు. అక్కడి ప్రజలు ప్రాజెక్టు కోరుకోనిపక్షంలో మరో ప్రదేశానికి మారుస్తామని ఉద్దవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు శివసేన-కాంగ్రెస్ మధ్య వైరానికి కారణంగా నిలిచింది. కొంకణ్ ప్రాంతం శివసేనకు పెద్ద ఓటు బ్యాంకు కావడంతో కాంగ్రెస్ మాటను శివసేన పెడచెవిన పెడుతున్నట్లుగా తెలుస్తున్నది.
ఇలాఉండగా, ఇరు పార్టీల మధ్య పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశం వచ్చి చేరి పొరపొచ్చాలు పెరిగేలా చేస్తున్నది. పదోన్నతుల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ మంత్రి నితిన్ రౌత్ వ్యతిరేకిస్తున్నారు. అణగారిన తరగతుల అధికారులకు అవకాశం వచ్చేలా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కొనసాగించాలని రౌత్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ సూచనకు అనుకూలంగా లేరు. దాంతో మంత్రి నితిన్ రౌత్.. ఈ సమస్యను మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోల్ చెవిన వేశారు. దాంతో ఆయన ఠాక్రేపై ఉన్న కోపంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లలో రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడు పార్టీల కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పాటించకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి వెనుకాడదని ఆయన బెదిరించారు.
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
కొవిడ్ నివారణలో ‘సెనోటైజ్’ 99 శాతం ప్రభావవంతం : గిల్లి రిగెవ్
భారత తొలి ప్రధాని నెహ్రూ కన్నుమూత.. చరిత్రలో ఈరోజు
సముద్రంలో అరుదైన ఖనిజాలను కనుగొన్న జపాన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..