ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల డైరెక్టర్గా హనుమంతరావు
సిద్దిపేట అర్బన్, జూన్ 12 : సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్ను ప్రభుత్వం నియమించింది. 2011 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్గా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సంగారెడ్డితో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.హనుమంతరావును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్గా నియమించింది. గతంలో కలెక్టర్గా ఉన్న వెంకట్రామ్రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన అనంతరం సిద్దిపేట కలెక్టర్గా ఎం.హనుమంతరావు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.