Loksabha Elections 2024 : రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నిషేధిత పీఎఫ్ఐ కాంగ్రెస్కు సంజీవనిలా మారిందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నిషేధిత పీఎఫ్ఐ కొమ్ముకాస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ తీరుతోనే బెంగళూర్లోని కేఫ్లో బాంబు పేలుడు జరిగిందని అన్నారు. దేశాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నిన ప్రమాదకర సంస్ధ పీఎఫ్ఐని మోదీ ప్రభుత్వం నిషేధించిందని గుర్తుచేశారు. పీఎఫ్ఐ తీస్మార్ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారని అన్నారు.
కర్నాటకలోని బళ్లారిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ ముందుకెళుతున్న తీరు కర్నాటకకు, దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఓటు బ్యాంక్ కోసం నేరం, ఉగ్రవాదంతో రాజీపడరాదని హితవు పలికారు.
Read More :