మనీలా : ఫిలిప్పీన్స్లో వైమానిక దళానికి చెందిన సీ-130 విమానం కూలిపోయింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది వరకు 17 మంది జవాన్లు మృతి చెందారు. 40 మందికిపైగా రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ సిరిలిటో సోబెజన తెలిపారు. దక్షిణ కగయాన్ డీ ఓరో నగరం నుంచి 85 మంది సిబ్బందిని తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సులు ప్రావిన్స్లోని జోలో ద్వీపంలో ల్యాండ్ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించినట్లు చీఫ్ ఆఫ్ స్టాఫ్ పేర్కొన్నారు. వారిని ఆసుప్రతికి తరలించినట్లు తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, మృతుల సంఖ్య మరింతే పెరిగే అవకాశం ఉన్నది. ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్ పోర్స్లో భాగంగా వారిని ఆ ఐలాండ్లో మోహరించేందుకు తరలించినట్లు తెలుస్తోంది.