వరంగల్ : కాంగ్రెస్(Congress) ప్రజా పాలనలో ప్రజల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మేం అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలను తీరుస్తాం. సమస్యలు దూరం చేస్తామని అబద్ధాలతో అధికారం చేపట్టారు. పాలన చేపట్టిన వంద రోజుల్లోనే సమస్యలు తగ్గకపోగా రెట్టింపయ్యాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రయాణాలు అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. బస్సుల(RTC Bus) కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గంటల తరబడి ఎదురుచూసినా నిరాశే తప్పడంలేదు.
మండే ఎండలు ఓ వైపు, బస్సుల రాకకోసం పడిగాపులతో జనం అల్లాడుతున్నారు. తాజాగా వరంగల్ – నర్సంపేట ఆర్టీసీ బస్టాండులో బస్సుల కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత నర్సంపేట నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
గంటల తరబడి ఎదురుచూసినా.. బస్సులు రావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. వచ్చిన ఒకటీ, రెండు బస్సులు సరిపోవడం లేదంటూ మండిపడుతున్నారు. ప్రజా పాలన అంటే మాటల్లో కాదు చేతల్లో చూపాలని, బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
బస్సుల కోసం వేచి చూస్తూ పడరాని పాట్లు.. రద్దీని బట్టి బస్సులను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అంటూ మండిపడుతున్న ప్రయాణికులు
వరంగల్ – నర్సంపేట ఆర్టీసీ బస్టాండులో బస్సుల కోసం ప్రయాణికుల ఎదురు చూపులు తప్పడం లేదు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత నర్సంపేట నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే… pic.twitter.com/8NsFG1hmf8
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2024