ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి బబుల్ నుంచి బయటపడి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్లోని తమ తమ టీమ్స్తో చేరగా.. కోహ్లి మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. ముంబైలోని తన ఇంటికి వెళ్లాడు. కరోనా కారణంగా ఏర్పాటు చేసిన బబుల్స్తో విసిగిపోయిన అతడు.. కొన్ని రోజుల పాటు ఇంట్లో గడుపుదామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన ఖరీదైన అపార్ట్మెంట్ బాల్కనీలో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. సొంతింటిలాగా ఏదీ ఉండదు అని కామెంట్ చేశాడు.
వరుసగా బయో బబుల్స్లో ఉండటంపై ప్లేయర్స్ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ మధ్యే కోహ్లి కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ మూడు రోజులు బ్రేక్ తీసుకొని ఏప్రిల్ 1 నుంచి అతడు మళ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ బబుల్లోకి వెళ్లనున్నాడు. బబుల్లో వరుస సిరీస్లు లేకుండా చూసుకోవాలని కూడా అతడు కోరాడు.
ఇవి కూడా చదవండి..
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం