న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నీట్ యూజీ – 2026 లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతున్న సమయంలో.. 2024 నీట్ పేపర్లీక్ కేసులో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2024లో నీట్-యూజీ పేపర్ లీక్ అవడంలో కీలక సూత్రధారిగా సంజీవ్ కుమార్ను అప్పట్లో బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సీబీఐకి కేసు అప్పగించిన తర్వాత.. రెండేండ్లుగా విచారణ జరిపి సంజీవ్ కుమార్ పేపర్ ప్రమేయం లేదని గురువారం క్లీన్చిట్ ఇచ్చింది. అతను అంతకు ముందే వేరేపేపర్ల లీకేజీ కేసుల్లో నిందితుడిగా ఉండటం వల్ల పోలీసులు అనుమానించినట్టు తెలిపింది. పాట్నా కోర్టులో 45 మంది నిందితులపై చార్ట్షీట్లను దాఖలు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.