హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో(Shamshabad Airport) చొరబడిన చిరుతను(Leopard) బంధించేందుకు అధికారులు చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు ఫలించడంలేదు. గత నాలుగు రోజులుగా ప్రత్యేక బృందాలు ముమ్మరంగా పని చేస్తున్నాయి. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు (Forest officials) 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
బోనులో మేకను సైతం ఎరగా వేసినా చిరుత బోనులోకి రావడంలేదు. బోను వరకు వచ్చి వెళ్లిపోతుంది తప్పా లోనికి వెళ్లడంలేదు. చిరుత ఒకే ప్రాంతంలో సంచరిస్తుందని, అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరలో చిరుతను పట్టుకుంటామని వారు తెలిపారు.