Suicide | రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయనితోపాటు పలు సీరియళ్లలో నటించాడు. చందుకు భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఆరేండ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉందని వదంతులు ఉన్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించింది. 2015లో శిల్పను ప్రేమించి పెండ్లి చేసుకున్న చందు.. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు.. చందు ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.