రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోలుకోవడానికి మరో నెల పట్టొచ్చునని న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) తెలిపింది. ఆయనకు బీపీ, మధుమేహం, హృద్రోగం, మూత్రపిండాల సమస్యలకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నా, లాలూను దవాఖాన నుంచి పంపివేసేందుకు తగిన పరిస్థితి లేదని వివరించింది. ఈ మేరకు లాలూ శిక్షను అనుభవిస్తున్న బిర్సా ముండా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాసిన లేఖకు సమాధానంగా ఎయిమ్స్ ఈ వివరణ ఇచ్చింది.
మూడు నెలల క్రితం గత జనవరిలో న్యూమోనియా లక్షణాలతో లాలూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. లాలూను పరీక్షించిన ఎనిమిది మంది సభ్యుల టీం సిఫారసు మేరకు ఆయనను ఎయిమ్స్కు తరలించారు. ఆయనను తిరిగి రాంచీ తీసుకెళ్ళడానికి గల అవకాశాల గురించి తెలపాలని ఎయిమ్స్ డైరెక్టర్కు బిర్సా ముండా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ లేఖ రాశారు.
దీనిపై స్పందిస్తూ ఎయిమ్స్ డైరెక్టర్ రాసిన లేఖలో లాలూ మరో నెల వరకు పూర్తిగా కోలుకునే అవకాశం లేదని తెలిపారు. జార్ఖండ్ జైళ్ల శాఖ ఐజీ వీరేంద్ర భూషణ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఇంకా చికిత్స జరుగుతున్నదని ఎయిమ్స్ డైరెక్టర్ తమకు నివేదిక పంపారన్నారు.
అయితే ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నట్లు ఎయిమ్స్ నివేదిక పేర్కొందని వీరేంద్ర భూషణ్ అన్నారు. ఆయన పూర్తిగా కోలుకునే విధంగా చికిత్స చేయడానికి తనకు రెండు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఎయిమ్స్ డైరెక్టర్ కోరారని వివరించారు. లాలూపై దాఖలైన ఐదు దాణా కుంభకోణం కేసుల్లో నాలుగింట్లో ఆయన దోషి అని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన బిర్సా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఆయన అస్వస్థతకు గురికావడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్ )లో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో లాలూను ఎయిమ్స్కు తరలించారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్