ఇస్లామాబాద్ : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొరుగు దేశం నుంచి దిగుమతులు చేసుకోవడం సాధ్యపడదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ స్పష్టంచేశారు. భారత్ నుంచి పత్తి, చక్కెరను దిగుమతి చేసుకోవడంపై మంత్రివర్గంతో సంప్రదింపులు జరిపిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ప్రధాని కార్యాలయాన్ని ఉటంకిస్తూ మీడియా నివేదికలు శనివారం తెలిపాయి.
తమ దేశానికి అవసరమైన వస్తువుల దిగుమతికి ప్రత్యామ్నాయ చౌక వనరులను కనుగొనడం ద్వారా సంబంధిత రంగాలను ఆదుకుంటామని ఇమ్రాన్ఖాన్ చెప్పారు. దుస్తులు. చక్కెర దిగుమతులను సులభతరం చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ, తన ఆర్థిక బృందానికి శుక్రవారం సూచించారని పాకిస్తాన్కు చెందిన డాన్ వార్తాపత్రిక తెలిపింది.
భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతులు చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ (ఈసీసీ) నిర్ణయించింది. ఆ మరుసటిరోజే పాకిస్తాన్ క్యాబినెట్ ఈ విషయమై చర్చించి ఈసీసీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులలో భారతదేశంతో ఎటువంటి వాణిజ్యం చేయడం ముందుకు సాగదని పాకిస్తాన్ నిర్ణయించింది.
ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించే బాధ్యత పాకిస్థాన్పైనే ఉన్నదని కూడా భారత్ స్పష్టం చేసింది.
చర్చలు, ఉగ్రవాదం కలిసి వెళ్ళలేవని, భారతదేశంపై వివిధ దాడులకు కారణమైన ఉగ్రవాద గ్రూపులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..