Accident | పెద్దపల్లి రూరల్ నవంబర్ 28 : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ డ్రైవర్గా పనుల కోసం ఎఫ్సీఐకి ఉదయం బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన పిడుగు గోపాల్ ఎఫ్సీఐలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజు వారి మాదిరిగానే శుక్రవారం కూడా తన బైక్ పై పనికి వెళ్తున్న క్రమంలో అందుగులపల్లిలోని ఇంటి నుంచి బయలు దేరి గ్రామసమీపంలోని పెట్రోల్ పంపు దాటుతున్న క్రమంలో పెద్దపల్లి వైపు నుంచి గోదావరిఖనివైపే వెళ్తున్న కారు వెనుక నుంచి వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వెళ్తున్న పిడుగు గోపాల్ ఎగిరి రోడ్డు పై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య సరోజన తో పాటు రమ్య, హిందు అనే ఇద్దరు కూతుర్లున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేశ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు.