Peddi Movie | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి ఏ అప్డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటుతుంది. చిన్న పోస్టర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసిన అది క్షణాలలో వైరల్ అవుతుంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పాటలతో ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్లో సంచలనంగా మారింది. అన్ని భాషల్లో కలిపి ఈ పాట ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ దాటడం గమనార్హం. ఇదే హైప్లో భాగంగా మేకర్స్ చికిరి సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, సినిమా యూనిట్ మొత్తం సుమారు 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తూ కొండపై ఉన్న లొకేషన్కు చేరుకున్న విధానం చూపించారు. ట్రెక్కింగ్ చేస్తూ రామ్ చరణ్ అలసిపోయి మధ్యలో ఆగి ఆ తర్వాత ముందుకు సాగడం వీడియోలో హైలైట్. చివర్లో బుచ్చిబాబు, రామ్ చరణ్ మధ్య ‘చిరుత’ సినిమా విషయంపై జరిగిన చిన్న సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.
మహారాష్ట్రలోని పుణే – సవల్య ఘాట్ ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించారు. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చదనం ఈ లొకేషన్ను అద్భుతంగా మార్చింది. అక్కడ వాహనాల రాకపోకలు లేకపోవడంతో, మొత్తం టీమ్ ట్రెక్కింగ్ ద్వారానే లోకేషన్కు చేరుకోవాల్సి వచ్చింది. చరణ్, జాన్వీతో పాటు మొత్తం యూనిట్ అదే విధంగా పైకి ఎక్కిన దృశ్యాలు మేకింగ్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ‘చికిరి’ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ శ్రమ, బుచ్చిబాబు నిబద్ధత, అద్భుతమైన లొకేషన్ అన్ని కూడా ‘పెద్ది’పై మరింత హైప్ను పెంచాయి. అభిమానులు ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.