న్యూఢిల్లీ : రెజ్లర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్కుమార్ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సుశీల్కుమార్తో పాటు ముండ్కా ప్రాంతానికి చెందిన మరో నిందితుడు అజయ్ని సైతం పోలీసులు జలంధర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ అత్తర్ సింగ్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు శివకుమార్, కరంబీర్ బృందం అరెస్టు చేసింది. ఈ నెల 4న ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ కుమార్ దాడి చేయడంతోనే సాగర్ చనిపోయాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సుశీల్పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. గత రెండు వారాలుగా పరారీలో ఉండగా.. అతని కోసం మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ దొరక్క పోవడంతో రూ.లక్ష రివార్డు సైతం ప్రకటించారు. ఇటీవల ఢిల్లీ రోహిణి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దరఖాస్తును కొట్టి వేసింది. సుశీల్ కుమార్ 2008లో బీజింగ్, 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ తరఫున రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య, రజత పతకాలు సాధించాడు.