న్యూఢిల్లీ, మే 22: ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులతోపాటు ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతించింది. ఇంతకుముందు ఉద్యోగులకే అనుమతి ఉండేది. వ్యాక్సినేషన్ను ఉద్యోగులకే పరిమితం చేస్తే ప్రయోజనం ఉండదని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్రం మునుపటి నిర్ణయాన్ని సవరించింది. ఉద్యోగుల కుటుంబసభ్యులకూ వ్యాక్సినేషన్ వర్తింపజేస్తూ రాష్ర్టాలకు అడ్వైజరీ జారీచేసింది. దీని ప్రకారం కంపెనీలు తమ అంతర్గత పాలసీ మేరకు ఉద్యోగి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయవచ్చు. ప్రభుత్వ సంస్థలలో వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 ఏండ్లు పైబడినవారికోసమైతే.. కేంద్రం రాష్ర్టాలకు అందించే కోటా నుంచి ఉచితంగా టీకాలు అందజేస్తారు.