శ్రీనగర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ సస్పెన్షన్కు గురైంది. తమ నిబంధనలను ఉల్లంఘించినందునే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ట్విట్టర్ పేర్కొన్నది. అయితే, ఏ నిబంధనను ఉల్లంఘించారన్నది ట్విట్టర్ సంస్థ స్పష్టం చేయలేదు.
అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ను ట్విట్టర్ సస్పెండ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఒక వీడియోను అప్లోడ్ చేశారు. ఇందులో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి కొవిడ్ -19 ఎస్ఓపీని ఖచ్చితంగా పాటించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలను కోరారు. జమ్ము కశ్మీర్ సమాచార, ప్రజా సంబంధాల శాఖ కూడా ఈ విషయంపై మౌనంగా ఉండిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు జమ్ము కశ్మీర్ ఎస్ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ మీర్ ధ్రువీకరించారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నామని, త్వరలో ఖాతాను పునరుద్ధరిస్తారని వెల్లడించారు.
నవంబర్లో థర్డ్ వేవ్ రావొచ్చు: ఐఐపీహెచ్ ప్రొఫెసర్ గిరిధర్ బాబు
ప్రకటనలకు ఖర్చు చేయడమే తప్పా ఆప్ చేసిందేమీ లేదు : బీజేపీ
పెరోల్పై ఖైదీల విడుదలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..