నైనిటాల్ : ఉత్తరాఖండ్లోని వివిధ జైళ్లో మగ్గుతున్న పలువురు ఖైదీలను 90 రోజుల పెరోల్పై విడుదల చేయనున్నారు. ఈ మేరకు హై పవర్ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మారి కొవిడ్ -19 సెకండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర జైలులో నిర్బంధించిన ఖైదీలకు కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు 90 రోజుల పెరోల్పై విడుదల చేయనున్నారు.
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం హై పవర్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరాఖండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్కే ఖుల్బే తెలిపారు. కమిటీలో జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ, రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి, జైళ్ల కమిటీ డైరెక్టర్ జనరల్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర జైలులో నిర్బంధించిన ఖైదీలను 90 రోజుల పెరోల్పై విడుదల చేయాలని కమిటీ మే 9 న ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలు తమ తమ గ్రామాల్లో తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కమిటీ సూచించింది. పెరోల్పై విడుదలవుతున్న ఖైదీలు విడుదలకు ముందే కరోనా చెకప్ చేయాలని ఆరోగ్య శాఖకు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఉత్తర్వును వెంటనే అమలులోకి తెస్తున్నట్లు అథారిటీ సభ్య కార్యదర్శి ఖుల్బే తెలిపారు.
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..