న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఆప్-ప్రభుత్వం 2015 నుంచి ప్రకటనల కోసం దాదాపు రూ.804.93 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్క కొత్త దవాఖానను తెరవలేదని బీజేపీ మండిపడింది. ప్రతి విషయానికి కేంద్రంపై నిందలు మోపడం మినహా వారికి తెలిసిందేమీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా బాధ్యతలను వదిలేసి చేతులు కడుక్కుంటున్నారని ఆరోపించారు.
సోమవారం వర్చువల్ విలేకరుల సమావేశంలో సంబిత్ పత్రా మాట్లాడారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 2015 నుంచి ప్రకటనల కోసం దాదాపు రూ.805 కోట్లు ఖర్చు చేసిందని, అయితే నగరంలో ఒక్క హాస్పిటల్ను కూడా ఏర్పాటుచేయలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిత్యం టీవీలో కనిపిస్తూ ఉండటం మినహా ప్రజల కోసం చేస్తున్నదేమీ లేదన్నారు. అబద్ధాలతో రోజులు గడుపుతున్నారని ఆయన చెప్పారు. ఏ చిన్న సమస్య వచ్చినా చేయకుండా చేతులు ఎత్తేస్తూ నెపం కేంద్రంపైకి నెట్టేస్తున్నారని తెలిపారు. దాదాపు రూ.1,400 కోట్ల విలువైన 1.34 కోట్ల వ్యాక్సిన్లను తమ ప్రభుత్వం ఆర్డర్ చేస్తుందని కేజ్రీవాల్ ఏప్రిల్ 26 న పేర్కొన్నట్లు పత్రా చెప్పారు. ఇంత అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వం ఇదొక్కటేనేమో అని పత్రా అన్నారు. ప్రజలకు టీకాలు అందించే కార్యక్రమాలు చేపట్టకుండా ప్రకటనలు జారీ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉంటుందో ఆప్ నాయకులకే తెలియాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నుంచి నిధులు కేటాయించినా.. స్థలం చూపించకుండా కాలాయాపన చేసి ఇప్పుడు ఆక్సిజన్ కరవు అంటూ దొంగ మాటలు మాట్లాడుతున్నారని సంబిత్ పత్రా ఆరోపించారు.
పెరోల్పై ఖైదీల విడుదలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..