ఒక బీఆర్ఎస్సే తెలంగాణకు శ్రీరామ రక్ష అని కేసీఆర్ అన్నారు. భారీ మెజార్టీతో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. రెప్పపాటు కూడా పోకుండా వచ్చిన కరెంట్.. ఇవాళ స్విచ్(కట్కా) ఏసినట్లు ఎందుకు పోతున్నదన్నారు. కేసీఆర్ రథం ఎక్కగానే రైతుబంధు వస్తున్నదన్నారు. దెబ్బకు దెయ్యం వదిలి రైతుబంధు పడుతున్నదని చెప్పారు. రోడ్షో అనంతరం గులాబీ దళపతి కేసీఆర్ నేరుగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసానికి వెళ్లారు. రోడ్షోలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య ఆయేషా ఫాతిమా, బిగాల మహేశ్ గుప్తా, వీజీ గౌడ్, ఎస్.ఏ.అలీం తదితరులు పాల్గొన్నారు.