లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆక్సిజన్ ప్లాంట్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోరు జారారు. ‘ఈ సమయంలో కోవిడ్ కారణంగా మన దేశంలో చాలా మంది ఆక్సిజన్ అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పారు. వెనువెంటనే తాను తప్పుగా మాట్లాడిన విషయాన్ని గ్రహించిన గడ్కరీ.. తర్వాత స్వరం తగ్గించి ప్రసంగం కొనసాగించారు.
గాలి నుంచి ఆక్సిజన్ తయారుచేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కొవిడ్లో ఒక్కో వ్యక్తికి 3 నుంచి 4 లీటర్ల ఆక్సిజన్ అవసరమని, 3 నిమిషాల్లో 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని తాను స్వయంగా అనుభవించానని తెలిపారు. ఇటువంటి పరిస్థితిలో అన్ని జిల్లాలు ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధిగా ఉండాలని గడ్కరీ సూచించారు. ఇప్పటినుంచే మూడవ, నాలుగవ వేవ్లకు సిద్ధంగా ఉండాలని, ఉత్తమమైన వాటి కోసం ఆలోచించండి.. చెత్త కోసం సిద్ధంకండి అన్న వాఖ్యంతో ప్రసంగం ముగించారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, మంత్రులు సిద్ధార్థనాథ్ సింగ్, మహేంద్ర నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నయా దోపిడీ : నకిలీ యాప్తో 5 లక్షల మందికి 150 కోట్ల మోసం
మమత డిమాండ్ : కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాల్సిందే..!
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ లెటర్ : స్కాలర్షిప్ కోసం బిర్సా కుటుంబీకుల వినతి
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
మంచి డిక్రీ : వ్యాక్సిన్ వేసుకోని వారికి గ్రామ బహిష్కరణ
సమష్ఠి విజయం : తొలి మాస్క్ రహిత దేశంగా ఇజ్రాయెల్
చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..