వడోదర : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మళ్లీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. తాజాగా గుజరాత్లోని వడోదరలో కవలలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కవలలు జన్మించిన 15 రోజుల తర్వాత తీవ్రమైన విరేచనాలతో వారిద్దరూ బాధపడుతున్నారు. అంతే కాకుండా ఇద్దరూ డీహైడ్రేషన్కు గురయ్యారు. దీంతో ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కవలలకు కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే పిల్లలకు వైద్యం కొనసాగుతోందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..