పాట్నా : లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని ఓ యువకుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను వేడుకున్నడంట. కరోనాను నిరోధించడంపై ఈ యువకుడికి ఎంత ప్రేమ అని అందరూ సంతోషించారంట. అయితే, అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారంట. అదేమంటే.. తన ప్రియురాలి పెండ్లిని ఆపేందుకే ఇలా లాక్డౌన్లో పెండ్లిళ్లపై నిషేధం విధించాలని కోరుకున్నాడంట.
కరోనావైరస్ ఇన్ఫెక్షన్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి బిహార్లో లాక్డౌన్ విధించారు. గత వారం ఈ లాక్డౌన్ను మే 25 వరకు పొడిగించారు. దీని గురించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్వీట్ చేశారు. రెండో దశ లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, పెండ్లిళ్లకు కేవలం 20 మందినే అనుమతించాలని నితీష్ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై బిహార్కు చెందిన పంకజ్ కుమార్ గుప్తా అనే యువకుడు వినూత్నంగా స్పందించాడు. లాక్డౌన్ సమయంలో వివాహాలను నిషేధించాలని డిమాండ్ చేశాడు. ఎందుకయ్యా అంటే ఈ నెల 19 న జరుగనున్న తన ప్రియురాలి వివాహం ఆగిపోతుందని చల్లగా సెలవిస్తున్నాడంట ఆ యువకుడు. ఇలా చేస్తే జీవితాంతం కృతజ్ఞతతో ఉంటానని కూడా చెప్తున్నాడు.
ఈ ట్వీట్ను వందలాది మంది ఇష్టపడ్డారు. యువకుడికి మద్దతుగా చాలా మంది ముఖ్యమంత్రి సహాయం కోరారు. కొంతమంది యూజర్లు వివాహం ఆపివేస్తే లాక్డౌన్ తర్వాత ప్రియురాలిని వివాహం చేసుకుంటావా? అని ప్రశ్నించారు. మొత్తానికి లాక్డౌన్లో వివాహాన్ని నిషేధించాలన్న యువకుడి ట్వీట్ వార్తల్లో ప్రధానాంశంగా తయారైంది.
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
ప్రయాణ పరిమితులను తొలగించిన సౌదీ అరేబియా
వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ బైక్
పూరీ జగన్నాథుడి చందన్యాత్ర ప్రారంభం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..