నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పానిండియా హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ ‘స్వయంభూ’. సంయుక్త మేనన్, నభా నటేష్ కథానాయికలు. భరత్కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. ఠాగూర్ మధు సమర్పకుడు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 16న విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఓ పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారు. దట్టమైన అడవిలో నిలబడి, ఈటను విసరడానికి సిద్ధంగా ఉన్న యోధుడిగా నిఖిల్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఈ పాట ఎంత గ్రాండియర్గా ఉండబోతున్నదో ఈ పోస్టర్ చెబుతున్నది. ‘రా రా ధీవర..’ అంటూ సాగే ఈ పాటను రవి బస్రూర్ స్వరపరిచారు. ఈపాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి మాటలు: విజయ్ కామిశెట్టి, కెమెరా: కె.కె.సెంథిల్కుమార్, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్.