సింగపూర్: కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గక పోవడం దృష్ట్యా అన్ని పాఠశాలలు మూసివేయాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. భారతదేశంలో మొదట కనుగొన్న కరోనా వేరియంట్ పిల్లలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని అధికారుల చెప్పారు. అందువల్ల, పాఠశాలల మూసివేతకు ఆదేశించి ఒకే సమయంలో యువతకు వ్యాక్సిన్ అందించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.
మే 28 వరకు అన్ని ప్రాథమిక, జూనియర్, మాధ్యమిక పాఠశాలలను పూర్తిగా గృహ ఆధారిత అభ్యాసంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేగంగా బయటపడిన వైరస్ వేరియంట్లు పిల్లలకు హానికరం చేస్తాయని, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగపూర్ విద్యా మంత్రి చాన్ చున్ సింగ్ చెప్పారు. ఇంటి నుంచే పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ విధమైన వేరియంట్కు గురైనట్లు గుర్తించలేదు.
ఆదివారం 38 కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఒకే రోజులో చాలా కేసులు రావడం సెప్టెంబర్ తరువాత ఇదే మొదటిసారి. ఈ సమయంలో చాలా వరకు పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. ట్యూషన్ సెంటర్లకు విద్యార్థులు వెళ్లడమే దీనికి కారణంగా గుర్తించారు. కొత్త వేరియంట్తో ఎంత మంది పిల్లలు ఇన్ఫెక్షన్కు గురయ్యారో ఇంతవరకు స్పష్టం కాలేదని ఆరోగ్య మంత్రి ఓంగ్కే యంగ్ చెప్పారు. సింగపూర్లో ప్రస్తుతం 61,000 కేసులు ఉన్నాయి.
ప్రయాణ పరిమితులను తొలగించిన సౌదీ అరేబియా
వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్ బైక్
పూరీ జగన్నాథుడి చందన్యాత్ర ప్రారంభం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
భద్రంగా అజ్మీర్లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..