కోల్కతా: 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై దీదీ మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారా? ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ప్రధాని నరేంద్ర మోదీతో సై అంటే సై అంటున్న దీదీ నిజంగానే వారణాసి బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా ఓడిపోవడం ఖాయమని, ఆమె మరో చోటు నుంచి కూడా నామినేషన్ వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ వేసింది.
దీదీ కచ్చితంగా నందిగ్రామ్ నుంచి గెలుస్తున్నారు. ఆమె మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోండి. ప్రజలు మీ అబద్ధాలను గుర్తిస్తారు. అసలు మీరే 2024లో మరో సీటు చూసుకోండి. ఎందుకంటే మీకు వారణాసిలో అసలుసిసలు సవాలు ఎదురు కాబోతోంది అని తృణమూల్ ట్వీట్ చేసింది. మరి వారణాసిలో మోదీకి సవాలు విసరబోయేది దీదీనేనా అన్న చర్చ మొదలైంది. మోదీకి వారణాసిలో కచ్చితంగా సవాలు ఎదురు కాబోతోందని, అయితే ఆయనపై మమత పోటీ చేస్తుందా లేదా అన్న నిర్ణయం పార్టీ తీసుకుంటుందని టీఎంసీ అధికార ప్రతినిధి తపస్ రాయ్ అన్నారు.
Didi is winning Nandigram. The question of her fighting from another seat doesn't arise. @narendramodi Ji, retract from your efforts to mislead people before they see your lies with the end of nomination in WB. Look for a safer seat in 2024, as you will be challenged in Varanasi.
— All India Trinamool Congress (@AITCofficial) April 1, 2021
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్తోనే వరల్డ్కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?