అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘రౌడీ జనార్ధన’. కీర్తి సురేశ్ కథానాయిక. రవి కిరణ్ కోలా దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. రాయలసీమలోని కళింగపట్టణం అనే ఊరు నేపథ్యంలో 80వ దశకంలో జరిగే పీరియాడిక్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఇందు లో రౌడీ జనార్ధన్గా ఊరమాస్ పాత్రలో విజయ్ దేవరకొండ ఆకట్టుకోనున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. నిర్మాణం శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఓ ప్రత్యేక గీతంలో నర్తించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: క్రిస్టో జేవియర్, విశాల్ మిశ్రా.