మహబూబాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాబాద్ రోడ్షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీ కవిత నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ బుధవారం సాయంత్రం 6గంటలకు జిల్లాకు చేరుకుంటారని, మహబూబాబాద్ లోకసభ పరిధిలోని నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాష్ట్రంలో పేదల కష్టాలను తీర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలుచేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, హామీల అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. కేసీఆర్ రోడ్షోకు 70వేల మందిని తరలించనున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సరిచేసుకోవాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత భారీ మెజార్టీతో గెలుస్తుందని సత్యవతి ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ మహబూబాబాద్ రోడ్షోలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాలు, ములుగు నియోజకవర్గంలోని కొన్ని మండలాల ప్రజలు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు నుంచి ర్యాలీ ప్రారంభమై ఇందిరాగాంధీ సెంటర్ చేరుకుంటుందని వివరించారు. సాయంత్రం 6గంటలకు కేసీఆర్ రోడ్ షోలో బస్సు పైనుంచి ప్రసంగిస్తారని తెలిపారు. ఉద్యమనేత కేసీఆర్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారని, వాస్తవాలు గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ను బొందపెట్టి, గెలిపించనున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. మానుకోట ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, కేసీఆర్ రాక కోసం ప్ర జలు, మహిళలు, యువకులు, రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పారు.ఎన్నికల్లో కారు గు ర్తుకు ఓటు వేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డ, ఇక్కడి ప్రజలను పేరు పెట్టి పిలిచే, ప్రజల కష్టాల్లో తోడుం డే, అందుబాటులో ఉండే, అభివృద్ధి చేసే తనను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.