Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ను పొడిగించారని జరుగుతున్న ప్రచారాన్ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుందని ప్రచారం జరిగింది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే మెట్రో రైలు టైమింగ్స్ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఈ టైమింగ్స్పై కేవలం పరిశీలన మాత్రమే జరిగిందని.. తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ, రైళ్ల అందుబాటు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వివరించారు. మెట్రో రైళ్ల టైమింగ్స్పై ప్రయాణికులు అయోమయానికి గురికావద్దని సూచించారు.