Manchu Manoj | ‘హను-మాన్’ వంటి బ్లక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ (Mirai). మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈ సినిమాకు ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టైటిల్తో పాటు గ్లింప్ల్స్ను విడుదల చేయగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ పాత్రకు సంబంధించి అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
మిరాయ్ నుంచి మంచు మనోజ్ పాత్రను మే 20న రివీల్ చేయనున్నట్లు ప్రకటించింది టీమ్. ఈ మేరకు ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో మంచు మనోజ్ మంత్రికుడి పాత్రలో కనిపిస్తున్నాడు.
Brace yourselves to witness our very own Rocking star @HeroManoj1 as A MIGHTY FORCE from the world of #MIRAI ⚔️
Unveiling #TheBlackSword in a Grand Launch Event on May 20th at AAA Cinemas from 10:30 AM onwards ❤️🔥#SuperYodha 🥷
Superhero @tejasajja123 @Karthik_gatta… pic.twitter.com/2nIkh607pD
— People Media Factory (@peoplemediafcy) May 18, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పశ్చాతాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే తేజ సజ్జా. ఇక గ్రంథాలను కాపాడడానికి తేజ ఏం చేశాడు. మంచు మనోజ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.