T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ టోర్నీ వామప్ మ్యాచ్ల తేదీలు వచ్చేశాయి. టీమిండియా(Team India) జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు న్యూయార్క్ విమానం ఎక్కేయనున్నారు. అయితే.. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్ల కారణంగా.. మే 25న కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు కొందరు మాత్రమే వరల్డ్ కప్ కోసం అమెరికా బయల్దేరనున్నారు.
హిట్మ్యాన్తో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(Rishabh Pant), అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు న్యూయార్క్ వెళ్లనున్నారు. ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఆఖరి ప్లే ఆఫ్స్ బెర్తు ఎవరిదో శనివారం సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మ్యాచ్తో తేలిపోనుంది. ఇప్పటికే టోర్నీ నుంచి ముంబై, లక్నో, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. దాంతో, షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ లీగ్ దశ ముగిశాక మొదటి బ్యాచ్ న్యూయార్క్ వెళ్లాలి.
అయితే.. బీసీసీఐ పెద్దలు ప్లాన్లో మార్పులు చేయడంతో ఆ తేదీ మే 25కు మారింది. అందుకని పదిహేడో సీజన్ నుంచి వైదొలిగిన రోహిత్, పాండ్యా, సూర్య, పంత్, బుమ్రా, అర్ష్దీప్, అక్షర్ పటేల్లు ముందుగానే న్యూయార్క్లో అడుగుపెట్టనున్నారు. ఇక ఐపీఎల్ ఫైనల్ ఆడే భారత క్రికెటర్లు మే 27న వరల్డ్ కప్ ఫ్లయిట్ ఎక్కనున్నారు.
భారత జట్టు వరల్డ్ కప్ స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ట్రావెల్ రిజర్వ్ : శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.