పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పుట్టిన 15 గంటల్లోనే నవజాత శిశువు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే, ఆమె తల్లికి నెగెటివ్గా వచ్చిందని వైద్య అధికారులు పేర్కొన్నారు. దర్షెత్ గ్రామానికి చెందిన ఓ మహిళ ఆదివారం పాల్ఘర్ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవించిన అనంతరం తల్లీ బిడ్డలకు కొవిడ్ నిబంధనల మేరకు వైద్యులు పరీక్షలు చేశారు. పరీక్షల ఫలితాలు సోమవారం రాగా.. శిశువుకు పాజిటివ్గా వచ్చిందని వైద్యులు పేర్కొన్నారు. పాల్ఘర్ జిల్లాలో నవరాజత శిశువుకు కరోనా సోకడం ఇదే తొలిసారని తెలిపారు. చిన్నారిని జవహర్ తాలూకాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా.. అధికారిక గణాంకాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలో 1,09,874 కరోనా కేసులు నమోదవగా.. 2,066 మరణాలు నమోదయ్యాయి.