హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మంగళవారం కన్నుమూశారు. హైదరాబాద్లో నివసిస్తున్న ఎస్వీ ప్రసాద్ కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో ప్రసాద్ దంపతులు యశోద ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స తీసుకుంటుండగానే.. పరిస్థితి విషమించి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన 1975 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఎస్వీ ప్రసాద్ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో సీఎస్గా సేవలందించారు. చంద్రబాబు సహా పలువురు ముఖ్యమంత్రులు కార్యదర్శిగా పని చేశారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేశారు.