హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరణించిన వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యం, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తారని పేర్కొన్నారు.