న్యూఢిల్లీ: ఒకే రోజు మూడు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా విమానయాన సంస్థల సేవలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (flight disruptions) బుధవారం ఉదయం కోల్కతా- చెన్నై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహించారు. కోల్కతా విమానాశ్రయంలో నిరసన చేపట్టారు.
కాగా, ఢిల్లీ- పూణే స్పైస్జెట్ విమానం మంగళవారం రాత్రి 9.55 గంటలకు టేకాఫ్ కావల్సి ఉన్నది. ప్రయాణికులు విమానం ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో విమానం లోపల వేడి వల్ల ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. పిల్లలు ఏడ్వగా, గర్భిణీలు మరింత ఇబ్బందిపడ్డారు. చేతితో విసురుకుని గాలి పొందేందుకు కొందరు ప్రయత్నించారు. ప్రయాణికుల నిరసనతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని పరిశీలించింది. ఆ విమాన సర్వీసును రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్లోకి చేరుకున్నారు. చివరకు బుధవారం ఉదయం 5 గంటలకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు మంగళవారం రాత్రి 11.30 గంటలకు కోల్కతా-చెన్నై ఇండిగో విమానం ఎడమ ఇంజన్ పనిచేయకపోవడంతో చెన్నై విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 224 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానం ల్యాండింగ్ కోసం అత్యవసర ప్రతిస్పందన ఏర్పాట్లు చేశారు. రాత్రి 11.37 గంటలకు అది సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊరట చెందారు. అనంతరం చెన్నై ఎయిర్పోర్ట్లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించడంతో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి.
हे दिल्लीहून पुण्याला जाणारे स्पाइसजेटचे विमान होते. विमानामध्ये आबालवृद्धांसह लहान मुलं देखील होती. या विमानात बसल्यानंतर विमानातील तापमान अचानक प्रचंड वाढलं. तापमान एवढं वाढत गेलं की लोकांना सहन होईना. सगळे घामाने ओले झाले होते. लोकांना श्वास घ्यायला खूप जास्त त्रास व्हायला… pic.twitter.com/jVYTEMcFNv
— Leshpal_speaks (@Leshpal_speaks) August 11, 2026