యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయంలో జూన్ 9 వరకు భక్తులకు అనుమతి లేదని, దర్శనాలను నిలిపివేస్తున్నామని తెలిపారు. ఆలయ విధులు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు లేకుండా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని తెలిపారు. దైవదర్శనాలను నిలిపివేయడంతో బాలాలయంలోని గర్భాలయానికి తెర వేశారు.