హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకుల పనివేళలల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. లాక్డౌన్ క్రమంలో బ్యాంకులు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉండేవి. సడలింపులు ఇవ్వడంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సోమవారం సమావేమై.. బ్యాంకు పనివేళ్లలో మార్పులు నిర్ణయం తీసుకుంది. దీంతో నేటి నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. మారిన బ్యాంకు వేళలు మంగళవారం నుంచి 9వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.