అమరావతి : అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తల్లితో కలిసి కోర్టుకు దరఖాస్తు చేశాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలోనే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చౌడేపల్లి మండలం బీర్జేపల్లికి చెందిన హర్షవర్ధన్ (9) అరుదైన రక్త వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కారుణ్య మరణానికి అనుమతి కోరేందుకు తల్లి అరుణతో కలిసి పుంగనూరు కోర్టుకు వచ్చాడు.
కారుణ్య మరణానికి గల కారణాలు తెలుపుతూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. అనంతరం తిరిగికి ఇంటికి వెళ్తున్న సమయంలోనే కోర్టు వద్దనే హర్షవర్ధన్ ప్రాణాలు వదిలాడు. గత నాలుగేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి బాలుడు అరుదైన రక్తవ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే కారుణ్య మరణానికి దరఖాస్తు చేసేందుకు కోర్టుకు వచ్చి.. అక్కడే బాలుడు మృతి చెందడం అందరినీ కలచివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.