కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హలీషహర్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ కాన్వాయ్ను నిరసనకారులు అడ్డుకున్నారు. కాన్వాయ్లోని కార్లపై బురద పూశారు. నీటి సీసాలు, చెప్పులు, బూట్లు విసిరారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘దొంగ’.. ‘దొంగల రాణి’ అంటూ ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ..సంఘ విద్రోహ శక్తులు తమపై రాళ్లదాడి చేశాయని, తామంతా చచ్చిపోయేవాళ్లమని ఆందోళన వ్యక్తం చేశారు.