ముంబై : రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం చెప్పారు. ప్రజల కదలికలపై కఠినమైన నియంత్రణలు, ఇతర కార్యకలాపాలు ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రంలో అమలులో ఉన్నాయి. ఈ నిబంధనలు ఏప్రిల్ 30 తో ముగియనున్నాయి.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రివర్గ సభ్యులందరూ లాక్డౌన్ పొడిగింపు చేపట్టాల్సిందే అని సూచించారు. “ప్రస్తుత కొవిడ్-19 పరిమితులను రాబోయే 15 రోజులు పొడిగించాలని మహారాష్ట్ర క్యాబినెట్ సభ్యులందరూ అభిప్రాయపడుతున్నారు” అని క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి తోపే మీడియాతో చెప్పారు. మహారాష్ట్రలో నేడు రోజువారీ కేసుల సంఖ్య 60,000 కుపైగా నమోదయ్యాయని, రోజువారీ కేసులు 70,000 దాటవచ్చని మేం ముందే ఊహించినా అది జరగలేదన్నారు. కేంద్రం సూచించినట్లుగా 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ టీకాలు వేయలాని క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించారు అని రాజేష్ తోపే వెల్లడించారు.
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించిన ఈయూ ఎంపీలు
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..