ముంబై : ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ఇన్ఫోసిస్కు చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటీవ్లతోపాటు మరో ఆరుగురికి వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. గత ఏడాది ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫోసిస్ ప్రభు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్ వీ సుబ్రమణియన్ లను దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ దర్యాప్తులో క్యాపిటల్ వన్ పార్టనర్స్ భారత్ జైన్, మరొక వ్యక్తి అమిత్ బుత్రాలను కూడా సెబీ దోషిగా తేల్చింది.
టెసోరా, క్యాపిటల్ వన్ రెండూ షేర్ ధరలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఆధారంగా ఇన్ఫోసిస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో షేర్లను కొనుగోలు చేసి విక్రయించాయని సెబీ తెలిపింది. ఇన్ఫోసిస్ అధికారి అయిన వెంకట్ సుబ్రమణియన్ ధరల సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని సెబీ భావిస్తున్నది. భూత్రాతో సుబ్రమణియన్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అందిన సమాచారం మేరకు విచారణ జరిపినట్లు సెబీ వెల్లడించింది.
కష్టకాలంలో ఒకరికొకరంగా సాయం : బ్రిక్స్ సమావేశంలో విదేశాంగ మంత్రులు
రుణ మాఫీకి చైనా నిరాకరణ.. ఇబ్బందుల్లో పాకిస్తాన్
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
బ్రిటన్లో మండుతున్న ఎండలు.. సముద్రం ఒడ్డుకు 40 లక్షల జనం
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
నేటి నుంచి గూగుల్ ఫొటో ఉచిత సేవలు బంద్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..