బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా కొవిడ్-19 నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, ఈ కష్టకాలంలో పరస్పర సహకారం అనే దానిపై ఐదు దేశాల విదేశంగా మంత్రులు చర్చించారు. ఈ కష్ట కాలంలో భారత్కు అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వెల్లడించారు.
బ్రిక్స్ ఐదు దేశాల సమూహం. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వర్చువల్ సమావేశం ప్రారంభం కాగానే అందరూ చేతులు జోడించి పలుకరించుకున్నారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని దేశాలకు సమాన హక్కులు, ప్రాతినిధ్యం లభించాలని కోరుకుంటున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఒకరికొకరు సార్వభౌమత్వాన్ని గౌరవించడం కూడా యూఎన్ చార్టర్ ప్రకారం ఉండాలన్నారు. అన్ని దేశాలు ఒకరి ప్రాంతీయ ఐక్యతను గౌరవించాలని సూచించారు.
దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి గ్రేస్ నలేది పండోర్ కరోనావైరస్ వ్యాక్సిన్ విషయాన్ని లేవనెత్తారు. టీకా విషయంలో సాంకేతిక బదిలీ, ఉత్పత్తిపై సహకారం, ఒప్పందం అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు మనం కూడా సురక్షితంగా లేమని గుర్తుంచుకోవాలన్నారు. టీకా విషయంలో ప్రపంచ అంతరం చాలా పెద్దదిగా ఉన్నదని, ఈ సమయంలో దానిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. భారతదేశం ప్రస్తుతం కష్టతరమైన కాలంలో ఉన్నదని, ఈ క్లిష్ట సమయంలో భారత్కు సహకారాన్ని అందివ్వడానికి హామీ ఇస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చెప్పారు.
రుణ మాఫీకి చైనా నిరాకరణ.. ఇబ్బందుల్లో పాకిస్తాన్
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
బ్రిటన్లో మండుతున్న ఎండలు.. సముద్రం ఒడ్డుకు 40 లక్షల జనం
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
నేటి నుంచి గూగుల్ ఫొటో ఉచిత సేవలు బంద్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..