ఇస్లామాబాద్ : పాకిస్తాన్కు తన స్నేహితుడు చైనా వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దివాలా అంచున ఉన్న పాకిస్తాన్కు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడానికి చైనా నిరాకరించింది. ఇంత మొత్తం రుణం చెల్లించలేక పాకిస్తాన్ ఆపసోపాలు పడుతున్నది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్కు చైనా రుణ మాఫీ నిరాకరణ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేట్లుగా కనిపిస్తున్నది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇచ్చిన 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 వేల కోట్లు) రుణాన్ని మాఫీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చైనాను అభ్యర్థించింది.
నివేదిక ప్రకారం, సీపీఈసీ కింద చేపట్టిన ఇంధన ప్రాజెక్టుకు ఇచ్చిన రుణాన్ని చైనా మాఫీ చేయాలని, దానిని పునర్నిర్మించాలని పాకిస్తాన్ కోరింది. అయితే, పాకిస్తాన్ విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. దీంతో చైనా ఇచ్చిన అప్పులను ఎలా తీర్చాలన్న సందిగ్ధంలో పాకిస్తాన్ పడిపోయింది. ఇప్పుడు అప్పుల భారంకన్న పాకిస్తాన్ డిఫాల్ట్ ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కోనున్నది.
పాకిస్తాన్ డిసెంబర్ వరకు దాదాపు 4 29,400 మిలియన్ (దాదాపు రూ.22 లక్షల కోట్లు) రుణాలు పొందింది. ఇది ఆ దేశ జీడీపీలో 109 శాతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2023 చివరి నాటికి ఈ నిష్పత్తి 220 శాతం వరకు చేరనున్నది. అప్పుడు 5 సంవత్సరాల ఇమ్రాన్ ప్రభుత్వం పదవీకాలం కూడా పూర్తవుతుంది. అప్పులు లేని పాకిస్తాన్ను తయారుచేస్తానని ఎన్నికల సమయంలో ఇమ్రాన్ఖాన్ చేసిన వాగ్దానాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
బ్రిటన్లో మండుతున్న ఎండలు.. సముద్రం ఒడ్డుకు 40 లక్షల జనం
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
నేటి నుంచి గూగుల్ ఫొటో ఉచిత సేవలు బంద్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..