జకార్తా : ఇండోనేషియాలో తప్పిపోయిన జలాంతర్గామి ఆచూకీ దొరికింది. బాలి ద్వీపానికి సమీపంలో సముద్రపు లోతుల్లో కనిపించింది. శిధిలంగా మారిన జలాంతర్గామి పరిస్థితిని చూస్తే దానిలోని 53 మందిలో ఎవరు కూడా బతికి లేరని తెలుస్తున్నది. ఇండోనేషియా నేవీ ఈ సమాచారం ఇచ్చింది. జలాంతర్గామిలోని సిబ్బంది అందరూ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థించాలని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో దేశ ప్రజలను కోరారు.
ఇండోనేషియా ఆర్మీ చీఫ్ హడి జహ్జాంటో తెలిపిన సమాచారం మేరకు.. సముద్రం ఉపరితలంపై చమురు వ్యాపించి ఉండటంతో బాలి ద్వీపానికి సమీపంలోని సముద్రపు లోతుల్లో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. తప్పిపోయిన ప్రదేశానికి సమీపంలోనే కేఆర్ఐ నంగ్లా 402 జలాంతర్గామి గుర్తించగలిగారు. సముద్రపు లోతుల్లో కొద్ది దూరంలో జలాంతర్గామి శిధిలాలు కనుగొన్నారు. జలాంతర్గామి శిధిలాలు సముద్ర మట్టానికి 500 మీటర్ల దిగువన ఉన్నట్లు గుర్తించారు. జలాంతర్గామి గరిష్టంగా 200 మీటర్ల లోతులో ఉంటుంది.
ఎక్కువ లోతులో నీటి పీడనం కారణంగా జలాంతర్గామి తీవ్రంగా దెబ్బతిన్నట్లు గణనీయమైన ఆధారాలు కనుగొన్నారు. ఈ కారణంగా అందులో ఉన్న 53 మంది నావికాదళ సిబ్బందిలో ఎవరైనా బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బుధవారం ఉదయం ప్రాక్టీస్ సమయంలో జలాంతర్గామి తప్పిపోయింది. జలాంతర్గామి పేలినట్లయితే అది ముక్కలుగా విరిగిపోయేదని ఇండోనేషియా నావికాదళ అధిపతి యుడో మార్గనో బాలిలో మీడియాతో చెప్పారు. అలాగే, పేలుడు శబ్దం సోనార్లో కూడా నమోదవుతుందని తెలిపారు.
ఇలా ఉండగా, జలాంతర్గామి మునిగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా మునిగిపోయి ఉంటుందని తొలుత భయాందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దాని నుంచి ఒక్క మృతదేహం కూడా కనుగొనలేకపోయారు.
ఇండోనేషియా జలంతర్గామి ఆచూకీ కనిపెట్టడంలో యూఎస్ పీ -8 పోసిడాన్ విమానం శనివారం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో చేరింది. 20 ఇండోనేషియా నౌకలు, సోనార్ సదుపాయంతో ఆస్ట్రేలియా యుద్ధనౌక, నాలుగు ఇండోనేషియా విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దీనిని వెలికితీసేందుకు శనివారం రాత్రి సింగపూర్ నుంచి నౌకలు, ఆదివారం మలేషియా, భారత్ నుంచి నౌకలు రానున్నట్లుగా సమాచారం.
ఉత్తమ 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ యంత్రాలివే..
శ్రీలంకలో డెడ్లీ కరోనా వైరస్ గుర్తింపు
కరోనా నిబంధనల ఉల్లంఘన : 13 మంది అభ్యర్థులపై ఎఫ్ఐఆర్
కరోనా ఎఫెక్ట్ : పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..