లక్నో, జూలై 23: ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్మీడియాలో క్రియాశీలకం గా ఉండే ముగ్గురు అక్కాచెల్లెళ్లు…వారి రీల్స్ తీసే కెమెరామెన్ను పెండ్లి చేసుకోవటం సంచలనంగా మారింది. ఓ ఆలయంలో జరిగిన వీరి వివాహానికి సంబంధించి వీడియో, ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూపీలోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ధౌరియా గ్రామానికి చెందిన అల్కా, దేవిక, సంతోష్లు అక్కాచెల్లెళ్లు. ఇన్స్టా, ఫేస్బుక్లలో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులనే పెండ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకు తొలుత చెప్పారట. ఏమైందో తెలియదుగానీ, ఈ ముగ్గురూ కెమెరామెన్ వికాస్ను ఓ ఆలయంలో వివాహం చేసుకోవటం..స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరు తోబుట్టువులు.