కొలంబో: భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి ఇప్పటికీ అనియంత్రితంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న శ్రీలంకలో కరోనా వైరస్ కొత్త జాతిని గుర్తించారు. కేవలం గంటపాటే ఈ డెడ్లీ వైరస్ గాలిలో ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇది ఇప్పటివరకు గుర్తించిన అన్ని వైరస్లలో కెల్లా ప్రాణాంతకమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ జాతి వైరస్ గాలి ద్వారా సోకుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
శ్రీలంకలోని జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలోని ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్సెస్ విభాగాధిపతి నీలిక మాలావిగే ఈ కొత్త జాతికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. ఈ రకం వైరస్ చాలా తేలికగా, చాలా త్వరగా వ్యాపిస్తుందని చెప్పారు. శ్రీలంకలో కనిపిస్తున్న అన్ని వేరియంట్లలో ఈ జాతి అత్యంత ప్రాణాంతకమైనది, వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు.
గత వారం నూతన సంవత్సర వేడుకల నుంచి కొత్త జాతి వ్యాప్తి చెందడం శ్రీలంక ఆరోగ్య శాఖ అధికారులను కలవరపెడుతున్నది. యువతలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఎంతగా వ్యాపిస్తుందో, మూడవ వేవ్ వ్యాప్తి చెందుతుందని పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఉపల్ రోహనా చెప్పారు. మొదటి ఇన్ఫెక్షన్ లక్షణాలు అంత స్పష్టంగా లేవని ఆయన అన్నారు. కొవిడ్ నుంచి రక్షణ కోసం మే 31 నాటికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
కరోనా నిబంధనల ఉల్లంఘన : 13 మంది అభ్యర్థులపై ఎఫ్ఐఆర్
కరోనా ఎఫెక్ట్ : పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..